కడప నగర శివార్లలోని నగరవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మద్యం మత్తులో కారు నడుపుతున్న ఇద్దరు యువకులు అతి వేగంగా వచ్చి లారీని ఢీకున్నారు. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.