నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి లో విషాదం చోటు చేసుకుంది. పండించిన పంటను కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి , కొడుకు ఇద్దరు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే భోసి గ్రామంలో కర్జాలా రాములు( 51) ,మురళి(21) అనే తండ్రి కొడుకులు ఇద్దరు మంగళవారం తమ పొలంలో సొయా కోశారు.
దీంతో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పంట తడిసిపోకుండా ఉండడానికి టార్పాలిన్ కప్పడానికి వెళ్ళారు.
అడవి జంతువుల నుండి పంటలను రక్షించుకోవడానికి అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
ఈ సంఘటన గ్రామం మొత్తాన్ని శోకసముద్రంలోకి నెట్టేసింది.