37.7 C
Hyderabad
May 4, 2024 13: 11 PM
Slider ఆదిలాబాద్

విద్యుత్ ఘాతానికి గురై తండ్రి, కొడుకు మృతి

#AdilabadDeaths

నిర్మల్  జిల్లా  తానూర్ మండలం భోసి లో విషాదం చోటు చేసుకుంది. పండించిన పంటను కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి , కొడుకు ఇద్దరు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే భోసి గ్రామంలో కర్జాలా రాములు( 51) ,మురళి(21) అనే తండ్రి కొడుకులు ఇద్దరు మంగళవారం తమ పొలంలో సొయా కోశారు.

దీంతో ఉదయం నుంచి  కురుస్తున్న వర్షానికి  పంట తడిసిపోకుండా ఉండడానికి  టార్పాలిన్ కప్పడానికి వెళ్ళారు.

అడవి జంతువుల నుండి పంటలను రక్షించుకోవడానికి అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో వారు అక్కడికక్కడే మరణించారు.

ఈ సంఘటన  గ్రామం మొత్తాన్ని శోకసముద్రంలోకి నెట్టేసింది.

Related posts

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Satyam NEWS

గురజాల డివిజన్ లో పేదోడి సొంతింటి కల సాకారం

Satyam NEWS

నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

Satyam NEWS

Leave a Comment