సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నెరేడుచర్ల మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయని అన్నారు.
గెలుపనేది ఒక వ్యక్తిపై ఆధారపడదని, సమిష్టి కృషి వల్లనే అది సాధ్యమౌతుందని అన్నారు. పార్టీకి అందరూ సమానమని, పార్టీని దిక్కరిస్తే సహించేది లేదని అన్నారు.
భూసర్వే, LRS పై ప్రజలలో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జయబాబు, వైస్ చైర్ పర్సన్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి,
DCCB డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.