జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్లో నలుగురు పాకిస్తాన్ తీవ్రవాదులు మరణించారు.
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించాయి.
ఈ క్రమంలో భద్రతాదళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు దీటుగా జవాబిచ్చారు.
మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.