28.7 C
Hyderabad
April 27, 2024 06: 11 AM
Slider కృష్ణ

మద్యం మత్తు కోసం శానిటైజర్ తాగి ఇద్దరి మృతి

#sanitizer

వారు మద్యానికి అలవాటు పడ్డారు…. అయిదే మద్యం ధరలు అందుబాటులో లేవు… ఏం చేయాలి? అందుకే వారు మద్యం మత్తు కోసం శానిటైజర్ తాగారు…..

ఈ దురదృష్టకరమైన సంఘటన విజయవాడ నగరంలో జరిగింది. విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు శానిటైజర్ తాగడంతో మరణించారు.

మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో  రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌ను కూల్ డ్రింక్‌లో కలుపుకుని తాగుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కూడా శానిటైజర్ తాగి మృతి చెందారు.

శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేశారు.

Related posts

ఎంపి రఘురామ ఫిర్యాదుతో హోం మంత్రికి తీరని కష్టం

Satyam NEWS

ఈ కత్తుల స్వైరవిహారం ఫొటోలు ఎక్కడివో తెలుసా?

Satyam NEWS

పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ .. వెల్లడించిన టెర్రరిస్ట్..

Sub Editor

Leave a Comment