వారు మద్యానికి అలవాటు పడ్డారు…. అయిదే మద్యం ధరలు అందుబాటులో లేవు… ఏం చేయాలి? అందుకే వారు మద్యం మత్తు కోసం శానిటైజర్ తాగారు…..
ఈ దురదృష్టకరమైన సంఘటన విజయవాడ నగరంలో జరిగింది. విజయవాడ వన్టౌన్కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు శానిటైజర్ తాగడంతో మరణించారు.
మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్ను కూల్ డ్రింక్లో కలుపుకుని తాగుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కూడా శానిటైజర్ తాగి మృతి చెందారు.
శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేశారు.