30.7 C
Hyderabad
May 5, 2024 06: 25 AM
Slider జాతీయం

కేరళలో కోవిడ్ నుంచి తేరుకున్న ఇద్దరు వృద్ధులు

covid kerala

కోవిడ్ 19 సోకిన ఇద్దరు వృద్ధులు కోలుకోవడం కేరళ వైద్యుల విజయంగా చెప్పవచ్చు. ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతను క్వారంటైన్ లో ఉండకుండా ఇంటికి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. అతని తండ్రికి 93 సంవత్సరాలు కాగా తల్లికి 88 సంవత్సరాలు.

వీరిద్దరూ ఇప్పుడు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. థామస్, మరియమ్మ అనే ఈ ఇద్దరూ కోలుకోవడంతో ఇంటికి వెళ్లిపొమ్మని వైద్యులు చెప్పారు. అయితే తమ కుటుంబలోని మరో ముగ్గురు వ్యక్తలు కొట్టాయం మెడికల్ కాలేజీలో ఇంకా చికిత్స పొందుతున్నారని వారు కూడా కోలుకునే వరకూ తాము ఆసుపత్రి నుంచి వెళ్లమని ఆ వృద్ధులు చెప్పారు.

దాంతో వారిని అక్కడే ఉంచారు. అయితే వారు తాము కోలుకోవడానికి సహకరించిన ఆరోగ్య కార్యకర్తలకు నేడు స్వీట్లు పంచిపెట్టారు.

Related posts

ఫ్యూచర్:ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు అమెజాన్ నిధులు

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS

ఒక పోలీసు చెప్పిన కథ: అన్నం శ్రమ జీవుల కష్టం

Satyam NEWS

Leave a Comment