Slider నిజామాబాద్

19 న యూసీసీ మద్దతు ర్యాలీ: కాటిపల్లి వెంకట రమణారెడ్డి

#kamareddy

ఈ నెల 19 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూసీసీ మద్దతు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని యూసీసీ మద్దతు దారుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ భవిష్యత్తు కోసమే యూసీసీ అని తెలిపారు. యూసీసీ కోడ్ ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. యూసీసీపై అపోహలు వద్దని, కొంత మంది కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. యూసీసీ వల్ల ఎవరికి నష్టం లేదని, యూసీసీతో మన పిల్లల భవిష్యత్ నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 19 న నిర్వహించే యూసీసీ మద్దతు ర్యాలీలో  కామారెడ్డి నియోజక వర్గంలోని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, వ్యాపారస్తులు, వైద్యులు, న్యాయవాదులు, పురప్రముఖులు విద్యావంతులు, యువకులు, రైతులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Related posts

‘మానవతా పరిమళం’ కు అనూహ్య  స్పందన

Satyam NEWS

గ్రూప్ – 1అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

Bhavani

సాయి పారాయణం కార్యక్రమానికి హాజరైన మంత్రి ఐకెరెడ్డి

Satyam NEWS

Leave a Comment