నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఫంక్షన్ హాల్ లో సాయిదీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సాయి పారాయణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. సాయిబాబా కి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం షిర్డీ సంస్థాన్ వికాస్ మహరాజ్ ప్రవచనాలను విన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్, సాయి దీక్ష సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్, నాయకులు సత్యనారాయణ గౌడ్, మారుగొండ రాము,దేవేందర్ రెడ్డి, అకోజి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
previous post