2018లో భారత దేశంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో రైతుల కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని ప్రకారం, 2018లో ప్రతిరోజూ సగటున 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధి వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, స్వయం ఉపాధి వ్యక్తులు కలిపి 26085 మంది ఉండగా, ఇదే సమయంలో దేశంలో 10,349 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
previous post