తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని ఉన్నఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే, ఇద్దర్ని చేసుకుని ఎలా వేగుతాను? అంటూ చమత్కరించారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ . కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా అసత్యమని అన్నారు.
. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పెళ్లాడితే రిసెప్షన్ మాత్రం శరద్ పవార్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ ను దాటి రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందని అన్నారు