సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను పారదోలుటకు తగిన చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తమ కంపెనీలో ఎంత మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్నారు, రోజువారీ కూలీలు ఎంతమంది ఉన్నారనే వివరాలను తెలియజేయాల్సినదిగా కోరడం జరిగినదని తెలిపారు.
ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయుటకు కావలసిన సాంకేతిక నైపుణ్య వివరాలు కూడా తెలియజేయవలసినదిగా ఫ్యాక్టరీ యజమాన్యన్ని కోరడం జరిగినదని తెలిపారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం పంపే వివరాలను బట్టి స్థానిక యువతకు సాంకేతిక పద్దతిలో నైపుణ్య శిక్షణను అందించి ఫ్యాక్టరీ యజమాన్యానికి కావలసిన విధంగా యువతను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.