29.7 C
Hyderabad
May 4, 2024 05: 42 AM
Slider ముఖ్యంశాలు

తుమ్మల భారీ ర్యాలీ

#tummala

రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అవిభక్త ఖమ్మం జిల్లా లో భారీ ర్యాలీ చేపట్టారు. వందల సంఖ్యలో కార్లు, వేల సంఖ్యలో మోటార్ సైకిళ్ళ తో ఆయన అబిమానులు అందులో పాల్గొన్నారు. 1983లో ఎన్‌టి‌ఆర్ పిలుపు తో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సుదీర్ఘకాలం మంత్రి గా పనిచేశారు. వుమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలోను ఆయనకు మద్దతుదారులు ఇప్పటికీ వున్నారు. 2016 లో టి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన ఆయన గత ఎన్నికలలో పాలేరు అసెంబ్లి నియోజకవర్గంలో వోటమి చెందారు. ఆ తర్వాత ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికి పార్టీ పరంగా ఇబ్బందులు పడ్డారు. ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్‌టి‌ఆర్ అభిమనులు చేసిన భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కొన్ని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం డివిజన్ లో సుమారు 150 కిలోమీటర్ ల యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా ల నుండి వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. వాజేడు లో జరిగే బహిరంగ సభలో ఆయన రాజకీయంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.

Related posts

చిత్తూరు జాతీయ రహదారిపై నలుగురి మృతి

Satyam NEWS

జర్నలిస్టులలో బలమైన శక్తిగా మారిన ఐజేయూ

Satyam NEWS

ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ ఓపెన్ హౌస్

Satyam NEWS

Leave a Comment