40.2 C
Hyderabad
May 2, 2024 15: 15 PM
Slider జాతీయం

85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. షాక్‌లో జైలు అధికారులు

కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్‌ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. సెప్టెంబర్‌లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్‌ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్‌ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్‌ల వల్లనే ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Related posts

హూజరాబాద్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది

Satyam NEWS

ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీకి డెమోక్రసీ అవార్డు

Satyam NEWS

Political turmoil : మరో బ్రిటన్ మంత్రి రాజీనామా

Satyam NEWS

Leave a Comment