కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. సెప్టెంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు.
అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల వల్లనే ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.