పురాతన ఇల్లు మట్టిమిద్దే కూలిపడి ఓ వ్యక్తి మృతి చెందారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో ఎల్లయ్య 40 అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వ్యక్తి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో భార్య పిల్లలు శోకసముద్రంలో మునిగారు.