ధరణి పోర్టల్ అమలు విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తహసీల్దార్లను సత్కరించారు. హబ్సిగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా మండల తాహసిల్దార్ ఎస్తేర్ అనిత, ఉప్పల్ మండల తాహసిల్దార్ గౌతమ్ కుమార్ లను ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి, లక్ష్మీనారాయణ, మనోహర్ ,సూరం శంకర్, శ్రీధర్ పాల్గొన్నారు.
previous post