32.7 C
Hyderabad
April 27, 2024 02: 08 AM
Slider కడప

అంతర్జాతీయ స్థాయి లో పతకాలు సాధించిన రాజు తెక్వండో విద్యార్థులు

#kadapa

నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయి తెక్వండో పోటీలలో కడపకు చెందిన రాజు తెక్వండో విద్యార్థులు Mvs నందిని, యశాహ్రి, లక్ష్మీ, అబ్దుల్ రషీద్, మంజునాథ్, రాజు, సుకేశ్ లు తమ సత్తా చాటారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ ను  అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విద్యార్థుల ను  వైస్సార్సీపీ నగర అధికార ప్రతినిధి పల్లెకొండు సంపత్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడి  క్యాంపు కార్యాలయంలో కడప నగర మేయర్ కె.సురేష్ బాబు అభినందించారు.

ఈ సందర్భంగా కడప నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం జిల్లా కు రాష్ట్రానికే కాకుండా భారత దేశానికి గర్వించదగ్గ విషయం అని, పిల్లలకు చదువు తో పాటు క్రీడలు కూడా భాగం అవ్వాలని  తెలిపారు. కోచింగ్ ఇచ్చిన రాజు ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కాణిపాకం చైర్మెన్ మోహన్ రెడ్డి, RN బాబు, వినోద్, లక్ష్మీ నారాయణ, శ్యాంసన్, షఫీ చైతన్య, అర్జున్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

రష్యాతో అనుబంధం మళ్లీ చిగురించే అవకాశం ఉందా….?

Satyam NEWS

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS

సింహాద్రి అప్పన్న కే శఠగోపం పెట్టిన భక్తుడు

Bhavani

Leave a Comment