23.2 C
Hyderabad
May 7, 2024 19: 58 PM
Slider నల్గొండ

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఉత్తమ్

నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ ను ఆదివారం సందర్శించి ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.

పార్లమెంటులో,వెలుపల తన నిరంతర కృషి కారణంగా ఇప్పుడు మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో
చెన్నై ఎక్స్‌ప్రెస్,తిరుపతి ఎక్స్‌ప్రెస్విశాఖ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ అలాగే డోర్నకల్‌ నుంచి కోదాడ,హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ వరకు కొత్త రైలు మార్గానికి సూత్రప్రాయంగా మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్న మేళ్ళచెరువు, మఠంపల్లి,జాన్ పహాడ్ విష్ణుపురం,మిర్యాలగూడ రైల్వేలైన్‌లో ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు.

మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాల పెంపుదల అంశాన్ని రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

దాతృత్వానికి మరోపేరుగా నిలిచిన మాగుంట సుబ్బరామిరెడ్డి

Bhavani

కాంగ్రెస్ లో చేరబోతున్న బిజెపి ఎంపి తండ్రి

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లోనే రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

Leave a Comment