అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఐదో రోజు ఉదయం శ్రీసౌమ్యనాధ స్వామి వారు శ్రీ మహావిష్ణువు గా శేష వాహనం వీధుల్లో విహారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో,స్వర్ణా భారణాలతో, వివిధ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకారా భూషితులై ఆశీనులైనారు.
మంగళ వాయిద్యాలు,కోలాటాలు,డప్పు వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో భక్తులు కు దర్శన మిచ్చారు. భక్తులు నారికేలం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకారించారు. భక్తుల గోవింద నామాలు కోలాహలం మధ్య తిరుచ్చి వేడుకగా సాగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఇవో నటేష్ ,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.