పోలీస్ స్టేషన్ లోనే వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేస్తూ స్టేషన్లోనే రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈనెల 13 మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి జేఏసీ వీఆర్ఏలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్న జేఏసీ వీఆర్ఏలను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు నిరసనగా కల్వకుర్తి పోలీస్ స్టేషన్లోనే రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అరెస్టు అయిన వారిలో జేఏసీ చైర్మన్ రమేష్ నాగరాజు పుష్పలీల తదితరులు ఉన్నారు.