38.2 C
Hyderabad
May 5, 2024 19: 08 PM
Slider నల్గొండ

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన ఉత్తమ్

#uttam

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి డోర్నకల్,నేలకొండపల్లి,కోదాడ,హుజూర్ నగర్,నేరేడుచర్ల,మిర్యాలగూడ కు కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు.

మోతమర్రి,జగ్గయ్యపేట,మేళ్ళచెర్వువు, మఠంపల్లి,జాన్ పహాడ్,విష్ణుపురం, మిర్యాలగూడ రైల్వే లైన్ లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని,వందే భారత్, నారాయణాద్రి,విశాఖ,చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లను నల్గొండ,మిర్యాలగూడ లో హల్ట్ కల్పించాలని కోరారు.ఖాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరి నిర్మించాలని,ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘంగా పై విషయాలను పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించానని ఇవి అత్యవసరమైన విషయాలని  రైల్వే  మంత్రికి విజ్ఞప్తి చేశారు.అందుకు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్  సానుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నందమూరి సుహాసిని జన్మదిన వేడుకలు

Satyam NEWS

‘దేశం’ వైపు చూస్తున్న వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు?

Satyam NEWS

అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

Bhavani

Leave a Comment