కేటిదొడ్డి నూతన ఎస్సైగా వి.వెంకటేష్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కురుమయ్య సెలవు పై వెళ్లడంతో ఆయన స్థానంలో నాగర్ కర్నూల్ జిల్లా డిఎస్బి ఎస్సైగా ఉన్న వెంకటేష్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వి.వెంకటేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహిస్తానని తెలిపారు. నూతన ఎస్ఐకి సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.
previous post
next post