శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పెద్ద పాడు గ్రామం లో రేపు బాల, బాలికలకు నిర్వహించే కుస్తీ పోటీలకు ఎంపికలు జరగబోతున్నాయ.
ఈ పోటీల నిర్వహణ సంఘ అధ్యక్షులు బొట్ట ఆసిరి అప్పడు, కార్యదర్శి నక్క రామన్న, వ్యాయామ ఉపాధ్యాయుడు డా.గుండబాల మోహన్, ఎల్. ఢిల్లీ శ్వరరావు, కుస్తీ పోటీల కోచ్ గోవిందరావు ఈ విషయాన్ని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీలకు హాజరు కాబోయే బాలబాలికలు ఉదయం ఎనిమిది గంటలకు వారి ఆధార్ కార్డు తీసుకుని శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్ద పాడు గ్రామ పంచాయతీ భవనం వద్ద హాజరు కావాలి.