ప్రజాసేవ చేయాల్సిన సర్పంచ్ ఆర్ధిక ఇబ్బందులతో కూలీ గా మారింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంతాలపల్లి గ్రామ సర్పంచ్ సుస్మిత తమ గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచింది. అందిలో భాగంగా గ్రామ అభివృద్ది కోసం 20 లక్షల రూపాయలు అప్పు చేసింది. బిల్లులు రాక పోవడం తో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ క్రమంలో ఇల్లు గడవడమే కష్టంగ మరటంతో కూలీ కి వెళ్తున్నది. అప్పుల భారంకు తోడు, కుటుంబ పోషణ బారమవడంతో చేసేదేం లేక దినసరి కూలి పనులు చేసుకుంటున్నామని సర్పంచ్ సుస్మిత వాపోయారు. అధికారులు తమకు రావాల్సిన బిల్లులు వెంటనే ఇస్తే తమకు భారం తగ్గుతుందని, అధికారులు కూడా కొందరు అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
previous post