న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఎస్పీ దీపికా కలెక్టర్ సూర్య కుమారీలు….!
రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్వగృహంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయన సతీమణి, మాజీ ఎంపి ఝాన్సీలక్ష్మికి వారి స్వగృహంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ముందు గా ఎస్పీ దీపికా ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బొత్స దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి, కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో అధికారులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్డిఓలు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఛాంబర్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
జాయింట్ కలెక్టర్కు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఇతర రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా సహాయ సంచాలకులు డి.రమేష్ కేక్ కట్చేసి, అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు, ఎడి రమేష్ ఆధ్వర్యంలో, డివిజనల్ పిఆర్ఓ ఎస్.జానకమ్మ, ఇతర సిబ్బంది వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.