నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ని ఆదివారం టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజలు తనను,ఉత్తమ్ పద్మావతిని ఎంతగానో ఆదరించారని, నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు, సహాయ,సహకారాలు,అండదండలు ఎల్లప్పుడు తమకు ఉండాలని కోరారు.
నియోజకవర్గ ప్రజల అభిమానానికి ఋణపడి ఉన్నానని,రెండు నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. కోదాడ,హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల అభివృద్ధే తమ ధేయమని,ప్రజల అందరి అండదండలతో ఈ స్థానంలో ఉన్నామని,కాంగ్రెస్ పార్టీ,తమపై నమ్మకం ఉంచి ఆదరించిన కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఈడుపుగంటి సుబ్బారావు,ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్,జక్కుల మల్లయ్య,బాచిమంచి గిరిబాబు,మంజు నాయక్,దొంగరి సత్యనారాయణ,కోతి సంపత్ రెడ్డి,సులువ చంద్రశేఖర్,జుట్టుకొండ సత్యనారాయణ, పిల్లుట్ల మధు, శివ,వెంకటేశ్వర్లు గురువారెడ్డి,కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్