కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా గెలుపును సవాల్ చేస్తూ 2018 లో హైకోర్టును అప్పటి తెరాస అభ్యర్థి జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని పిర్యాదు లో పేర్కొన్న జలగం వెంకట్రావ్, విచారణ జరపాలని కోరారు.
సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్ఛిన హైకోర్ట్,సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేత గా ప్రకటించిన కోర్టు, ఎన్నికల కమీషన్ కు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమా కు రూ 5 లక్షలు జరిమానా,2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే గా అర్హుడు కాదని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.