ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూతు లో పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్ లో చోటుచేసుకుంది. జంక్షన్ లో ఏర్పాటు చేసిన బూత్ లో ట్రాఫిక్ పోలీసులు కూర్చొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్ ను కంట్రోల్ చేయడం చేస్తుంటారు.
కానీ ఇక్కడ ఇద్దరు పోకిరీలు మందు కొట్టడానికి అడ్డాగా మార్చు కున్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలున్నా అవి కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేసి ఉన్నా పోలీసులు ఎవరూ గుర్తించలేదు. కానీ ఇది గమనించిన కొంతమంది మందు బాబుల వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది….