37.2 C
Hyderabad
May 2, 2024 12: 37 PM
Slider విశాఖపట్నం

స్పీకర్ ఫార్మేట్ లో గంటా రాజీనామా లేఖ సమర్పణ

#VizagJournalistsFourm

మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖలను సోమవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ద్వారా అసెంబ్లీ కార్యదర్శి పి బాల కృష్ణమాచార్యులు కు  అందజేశారు.

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ అర్ ప్రసాద్ తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని నేడు కలిసి ఈ లేఖను అందించారు.

ప్రజల కు, ప్రభుత్వం కి వారధి గా నిలిచే జర్నలిస్ట్ ల ద్వారా తన రాజీ నామా లేఖ లు అందచేయాలి అని గంటా శ్రీనివాసరావు భావించి తమకు వాటిని అప్పగించారని వారు చెప్పారు. ఈ మేరకు తాము బాధ్యత గా వాటిని అసెంబ్లీ కార్యదర్శి కి అందచేసినట్లు చెప్పారు.

తన రాజీనామా ఆమోదానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని గంటా ఆ లేఖలో  కోరారు. ఈ లేఖలు ను తాను స్పీకర్ ఫార్మాట్ లోనే  పంపించానని అసెంబ్లీ కార్యదర్శి కి గంటా ఫోన్ లో స్పష్టత ఇచ్చారు.

ఇంకా ఎటువంటి వివరాలు కావాలన్నా  తాను అందచేస్తా అని గంటా స్పష్టం చేసారు.  అసెంబ్లీ కార్యదర్శి ఈ లేఖను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి పంపిస్తానని చెప్పారు.

Related posts

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

విజయనగరం యూత్ సేవలను మెచ్చుకున్న డీజీపీ

Satyam NEWS

కొత్త ఆవిష్కరణలు విద్యార్ధి దశ నుంచే మొదలు కావాలి

Satyam NEWS

Leave a Comment