37.2 C
Hyderabad
May 6, 2024 13: 03 PM
Slider కరీంనగర్

వేములవాడ రాజన్న ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

#vemulawada

శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అలాగే మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆలయ అర్చకులు వేద మంత్రాలతో గావించారు. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు అమ్మవారికి  కుంకుమ పూజలు, ఒడిబియ్యం సమర్పించారు. తమ కుటుంబం, అందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు.

Related posts

ఫలకనుమా ఎక్సప్రెస్ లో మంటలు

Bhavani

కలెక్టర్ ఆదేశాలు… డీఆర్ఓ ఆచరణ…ఫలితం.. కలెక్టరేట్ ప్రాంగణం ఆధునికీకరణ

Satyam NEWS

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

Bhavani

Leave a Comment