యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు.
రెండు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. హౌరా నుండి సికింద్రాబాద్ కు ఈ రైలు వస్తున్నది. ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.