నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన పురోహితుడు శివశ్రీ వినయ్ కుమార్ శాస్త్రి ప్రతిష్టాత్మక వైదిక ధర్మాచారణ విభూషణ రత్న అవార్డు పొందారు. హైదరాబాద్ లోని ప్రముఖ సేవా సాంస్కృతిక సంస్థ అయిన సర్ సీవీ రామన్ అకాడమీ 27 వ ఉగాది మహోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించింది. వైదిక ధర్మాచరణ విభూషణ రత్న అవార్డులో భాగంగా పురోహితుడు శివశ్రీ వినయ్ కుమార్ శాస్త్రి కి సువర్ణ కంకణం బహూకరించారు. ఈ అవార్డు బహూకరణ కార్యక్రమం హైదరాబాద్ హరిహర కళాభవన్ లో ఘనంగా జరిగింది. వైదిక ధర్మాచరణ విభూషణ రత్నఅవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కొల్లాపూర్ తాలూకా పురోహితులు శివ శ్రీ వినయ్ కుమార్ శాస్త్రి తెలిపారు.
previous post
next post