విశాఖ డివిజన్ రైల్వే మేనేజర్ తో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలోని పలు రైల్వే సమస్యల పరిష్కారంపై చర్చించారు. విజయనగరం జిల్లాలో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ ను కలిసి చర్చించారు. కోమటిపల్లి రైల్వే స్టేషన్ లో గూడ్స్ షెడ్ నిర్మించాలని, శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం రైల్వే స్టేషన్ లో పలాస పాసింజర్ కు హాల్ట్ సౌకర్యం కల్పించాలని, బొబ్బిలి లో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు భవనం శిథిలావస్థకు చేరినందున కోర్టు భవనం మార్పు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారంపై డి.ఆర్.ఎం. శతపథి సానుకూలంగా స్పందించినట్లు ఎం.పి.. పేర్కొన్నారు.