38.2 C
Hyderabad
April 27, 2024 16: 07 PM
Slider నిజామాబాద్

కరోనా విజిట్: గ్రామాలలో పర్యటించిన మండల పరిషత్ అధికారి

MPO visit

బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి పెద్దదడిగి మానేపూర్ గ్రామాలలో మండల పరిషత్ అధికారి మహ్బూబ్ శనివారం పర్యటించారు. చిన్న దడిగి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామ పనులను పరిశీలించిన ఆయన అనంతరం పెద్దదడిగి మానేపూర్ గ్రామాలలో పర్యటించి కరోనా వైరస్ పట్ల అప్రమత్తతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని అత్యవసరమైతే తప్ప అసలు రావద్దన్నారు. మనిషికి మనిషికి దూరం పాటించి కరోనా వ్యాప్తికి  అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కుని భోజనాలు చేయాలని చిన్నపిల్లలు వృద్ధులకు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చిన్న దడిగి సర్పంచ్ అనిత విఠల్ రెడ్డి, పెద్ద దడిగి సర్పంచ్ సాయిలు, మానేపూర్ సర్పంచ్ దాసరి రాములు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆశా కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Related posts

CVS Staminon Male Enhancement Supplement

Bhavani

వేడుకగా ముగ్గుల పోటీ: విజయనగరం శిల్పారామంలో సందడే సందడి

Satyam NEWS

అమెరికా ప్రజలకు మరింత అందుబాటులో ఫైజర్ వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment