విజయనగరం జిల్లా కొత్త ఎస్పీగా దీపికా పాఠిల్ పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కాన్ఫరెన్స్ హాలులొ తొలిసారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పని చేసే అనుభవం ఉందన్నారు. పార్వతీపురం ఓఎస్డీ గా పని చేసానన్నారు.
ప్రస్తుతం ఎస్పీ కొనసాగిస్తున్న విధానాలనే కొనసాగిస్తునన్నారు. ప్రేమ,శాంతి ఈ రెండే నా ఆయుధాలన్నారు.
శాఖా పరంగా తీసుకోవలసిన చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చిస్తానన్నారు. నెల రోజుల్లో జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుంటానన్నారు.మహిళలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. వారి సమస్యలపై ప్రతీ పోలీస్ స్టేషన్ ను ఇన్ స్పెక్ట్ చేసి సమస్యలు అడిగి తెలుసుకుంటన్నారు.
అంతకు ముందు జిల్లా కొత్త పోలీస్ సూపరింటెండెంట్ గా దీపికా పాఠిల్ పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎస్పీ రాజకుమారీ డీఐజీ గా పదోన్నతి పై విజయవాడకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన బాధ్యతలను కొత్తగా వచ్చిన దీపికా పాఠిల్ కు అప్పగించారు.
డీపీఓ సీసీ కృష్ణ మూర్తి ఇచ్చిన ఫైళ్లపై గ్రీన్ ఇంక్ తో నూతన ఎస్పీ దీపికా పాఠిల్ తొలి సంతకం చేసారు. అంతకు ముందు ఈ తెల్లవారుజామున 4.30కు వైజాగ్ వచ్చిన దీపికా పాఠిల్ కు ఏఆర్ అడ్మిన్ చిరంజీవి, డీఎస్పీ శేషాద్రి లు స్వాగతం పలికి సరాసరి విజయనగరం బ్యారక్స్ లో పోలీసు గెస్ట్ హౌస్ కు తీసుకు వచ్చారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత ఎస్పీ రాజకుమారీ తన చివరి ప్రజాపౌర సన్మాన కార్యక్రమానికి హాజరై వచ్చిన వెంటనే రమారమి 012.55 నిమిషాలకు తన బాధ్యతలను కొత్త ఎస్పీ దీపికా పాఠిల్ కు అప్పగించారు.
జిల్లా అదనపు ఎస్పీలు సూర్యనారాయణ, సత్యనారాయణ, డీఎస్పీలు మోహనరావు, సుభాష్,అనిల్ ,ఇతర పోలీసు అధికారులు కొత్త ఎస్పీ దీపికా పాఠిల్ స్వాగతం పలికారు.