సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మాల మహానాడు కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్ పాల్గొన్నారు.
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఇంటిమళ్ళ మధు సూచనల మేరకు రాజేష్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గ మాల మహానాడు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా జలగం అఖిల, నియోజకవర్గ అధ్యక్షుడుగా జాలాది నాగరాజు,పట్టణ అధ్యక్షుడుగా ఉండేటి సతీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దగ్గుపాటి రాజేష్,రాగి నిఖిల్,బొల్లెద్దు చంటి,కందుల బాలస్వామి,కె.రజిత,పోకబత్తిని కోటేశ్వరి, వినోద్, గోపి, క్రాంతి,పాలపాటి చంద్రశేఖర్,చెవుల రాకేష్,జి.రంజిత్,కామళ్ళ వంశీ,అజయ్,రామకృష్ణ, వెంకటేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.