గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్యాన్సర్ల తో నృత్యాలు చేసి వైసీపీ నాయకులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నాయకుల నృత్యాలను ‘‘సత్యం న్యూస్.నెట్’’ ఫొటోలతో సహా వెలికితెచ్చిన విషయం తెలిసిందే.
పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకపోవడం, కొవిడ్ నిబంధనలు పాటించక పోవడం, డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయడం పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం గమనార్హం.
ముగ్గురు మహిళా డాన్సర్లు, నలుగురు వైసీపీ నాయకులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోవిడ్ సమయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు.