40.2 C
Hyderabad
May 2, 2024 16: 22 PM
Slider విజయనగరం

విజయనగరం పోలీసు శాఖకు అవార్డుల పంట…!

#vijayanagarampolice

3 సీఐలు..8మంది ఎస్ఐలతో కలిపి 128 మంది అందుకోనున్న అవార్డులు…!

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్రంలో విజయనగరం పోలీసు శాఖకు అవార్డుల పంట లభించింది. అలాగే జిల్లా లో భోగాపురం స్టేషన్ ఏఎస్ఐ కు కేంద్ర అవార్డు దక్కడం విశేషం. ఇక ఏపీ రాష్ట్రంలో విజయనగరం జిల్లా పోలీసు శాఖలో…128 సిబ్బంది అవార్డులు అందుకోనున్నారు. ఇందులో విజయనగరం వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాంబాబు… భోగాపురం సీఐ విజయనాధ్ లు అవార్డు అందుకోనున్నారు. అలాగే వన్ టౌన్ ఎస్ఐ అశోక్, నెల్లిమర్ల ఎస్ఐ నారాయణ, గుర్ల ఎస్ఐ శిరీష లకు దక్కడంతో పాటు 28 మంత్రి అవార్డులు అందుకోనున్నారు. వీళ్ళ తో పాటు.. రెవెన్యూశాఖ నుండీ దాదాపు తొంభై మంది అవార్డులు అందుకోనున్నారు. ఇక ఈ అవార్డు లలో 26 మంది జిల్లా అధికారులు..అవార్డులు అందుకోనున్నారు. ఏదైనా.. ఈ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ కు చెందిన సిబ్బంది.. అవార్డులు అందుకోవడం విశేషం.

Related posts

విజయనగరం లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

Satyam NEWS

లఖీమ్‌పూర్‌ కేసులో ఆశిష్‌ మిశ్రాకు 3రోజుల పోలీస్‌ కస్టడీ

Sub Editor

రేపు, ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన

Bhavani

Leave a Comment