ఆరు నెలల క్రితం విజయనగరం జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గా వచ్చిన ఎస్పీ దీపికా …పోలీస్ శాఖలోతనమైదనముద్ర వేసుకుని…తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో నడుస్తున్న శార్వాణీ పాఠశాలలో ఇటు ఆర్మర్ రిజర్వు విభాగంలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శార్వాణి పోలీసు పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్స్ ను పంచి, ప్రతీ విద్యార్థి జాతీయ భావం కలిగి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ శ్రీ పి.సత్యనారాయణ రావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ట్రాఫిక్ డిఎస్పీ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ నుంచీ పరడే్ గ్రౌండ్ కుసమీపంలో ఉన్న ఆర్మర్ రిజర్వు విభావం వద్ద ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలోజరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలోనూ ఎస్పీ దీపిక పాల్గొని, జాతీయజెండా ఎగరవేసి ఆర్మర్డ విభాగం నుంచీ గౌరవ వందనం స్వీకరించారు
previous post