కర్నూలు లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరితోపాటు కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి రమణమూర్తి, పీఆర్వో రవి కుమార్, కమిషన్ విభాగ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్, పలువురు అధికారులు సిబ్బంది పలువురు జిల్లా ఉన్నతాధికారులు, కర్నూలు ఆర్డీవో శ్రీనివాసులు, పలువురు పోలీసు శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.