గతేడాది కరోనా ప్రబలుతున్న సమయంలో విజయనగరం జిల్లా కు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన దీపికా ఎం పాటిల్ శరవేగంగా స్టేషన్ లను తనిఖీ లు చేసి తన పనితీరు ఏంటో శాఖా సిబ్బందికి చూపించారు. ఇందులో భాగంగానే అర్థరాత్రి ఎస్.కోట సర్కిల్ లో ఆకస్మిక తనిఖీలు, పర్యటన లు చేసారు. ఇటీవల అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ గా పదోన్నతి లభించిన విజయనగరం ఇంచార్జి డీఎస్పీ అనిల్ తో ఎస్.కోట సర్కిల్ బొడ్డవర చెక్ పోస్ట్ ను రాత్రి తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది పనితీరు ను ప్రత్యక్షంగా చూసారు. ఈ సందర్భంగా అక్కడే రికార్డులను తనిఖీ చేసి, చెక్ పోస్టు సిబ్బంది పని తీరును పర్యవేక్షించారు. అక్కడ నుంచీ ఎస్.కోట పోలీసు స్టేషన్, అలాగే సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ లు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషను పరిసరాలను పరిశీలించి, స్టేషను రికార్డులను, సిడి ఫైల్స్ ను, క్రైం చార్ట్ ను పరిశీలించారు. జిల్లా ఎస్పీ వెంట ఎస్. కోట సీఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ తారకేశ్వర రావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
previous post
next post