రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. నగరి ఎంపీడీవో సచివాలయం పరిధిలోని పద్మావతి నగర్ 26వ వార్డులలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రోజా బుధవారం పాల్గొని ప్రసంగించారు. “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును, రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
ప్రజాప్రతినిధులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్య కర్తలు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కమిషనర్ మున్సిపాలిటీ, ఎమ్మార్వో, డి ఈ, ఏఈలు, మెక్మా సిబ్బంది, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.