ఏపీ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఇచ్చిన సూచనలతో పలు పోలీసు స్టేషన్ పరిధిలో గల డాబాలు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేశారు. అలాగే వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో గల ముఖ్య కూడళ్లలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి, ఎం.వి.నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ-చలనాలు విధించి, ఎం.వి.నిబంధనలు పట్ల అవగాహన కల్పించారు.
previous post