పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో ఎమ్మెల్యే కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (35) కన్నుమూశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఎమ్మెల్యే గుండెలు బాదుకొని రోదిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో నానక్రాం గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన ఆయన మరణించారు. విష్ణువర్ధన్ రెడ్డి మృతితో ఎమ్మెల్యే కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుంది.
అందరితో కలిసి మెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరించే విష్ణు మరణవార్తతో సన్నిహితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన మరణవార్తతో పటాన్ చెరు ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కిరణ్మయి తో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.