28.7 C
Hyderabad
May 6, 2024 02: 38 AM
Slider రంగారెడ్డి

వివేకానందుని బోధనలు అనుసరణీయం

#Etala Rajender

స్వామి వివేకానంద 160 వ జయంతి ఉత్సవాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ నేడు పాల్గొన్నారు. మేడ్చల్ చౌరస్తాలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వామి వివేకానంద భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు.

వివేకానందుడు అతి గొప్ప మేధావి. ఆయన జీవితం మానవాళికి ముఖ్యంగా యువతకి స్ఫూర్తి.

మన దేశం మానవసంపద గల దేశం. అందునా యువశక్తి ఉన్న దేశం అని ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది అని వివేకానందుడు చెప్పారు. వివేకానందుని బోధనలు, సూక్తులు ఆచరించి ముందుకు పోవాలి అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Related posts

వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు

Bhavani

కరోనా కాలానికి ముగింపు!

Sub Editor

బీజీపీ ఎమ్మెల్యేకు ఉన్నావ్ ఉచ్చు

Satyam NEWS

Leave a Comment