డా కందుల నాగరాజును విశాఖ సిటీ వాసవి క్లబ్ డిస్టిట్ వైస్ గవర్నర్ గా నియమించారు. మానవ సేవయే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన వ్యక్తి కందుల నాగరాజు. దాన గుణంలో చేతికి ఎముక లేని దాతగా పేరొంది కె.ఎన్.ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సేవలు మెచ్చి స్థానిక ప్రజలు కార్పొరేటర్ గా గెలిపించారు. నేడు ఆయన సేవలకు వాసవి క్లబ్ వారు వాసవి క్లబ్ డిస్టిట్ వైస్ గవర్నర్ గా నియమించారు. వాసవి క్లబ్ విశాఖ డిస్టిట్ గవర్నర్ కీర్తన లక్ష్మీ చేతుల మీదగా నియామక పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యలలో ఆణిముత్యం మన కందుల నాగరాజు అని అన్నారు. ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వాసవి క్లబ్ ప్రతిష్టను ఇంకా పెంచాలని కోరారు. ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి క్లబ్ సభ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంకటాల ప్రభాకర్, కె.వి గుప్తా,వి.పండు,పి.బంగారు శెట్టి,అడ్డగాల సునీత, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post