28.7 C
Hyderabad
May 6, 2024 09: 35 AM
Slider విజయనగరం

విజయనగరం రైల్వే స్టేషన్ అడ్డాగా మైనర్లతో గంజాయి అమ్మకం

#Selling Marijuana

ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగా సాగే గంజాయి అక్రమరవాణా… ప్రస్తుతం పట్టణాలకు పాకింది. అదీ ఏపీలో ని కోస్తాంధ్ర లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రదేశం లో లభ్యమవడం విశేషం. తాజాగా విద్యల నగరమైన విజయనగరం.. ఆ పేరు కు అపఖ్యాతి తెస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదీ ముక్కు పచ్చలారని చిన్నారులతో… అభం శుభం ఎరుగని పిల్లలను గంజాయి రవాణా కు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా “సత్యం న్యూస్. నెట్” పరిశోధన ఆసక్తి కరమైన అంశాలు వెలుగులో కి వచ్చాయి.

అదీ విజయనగరం వన్ టౌన్ స్టేషన్ కు జులై లో కొత్తగా వచ్చిన సీఐ డా.వెంకటరావు… గంజాయి రవాణా పై దృష్టి పెట్టడంతో… తీగ మొత్తం కదలుతోంది.అందుకు నిదర్శనమే…ఆరుగురు మైనర్లు… వన్ టౌన్ స్టేషన్ లో ఉండటం.

ఈ చిన్న పిల్లలకు… మహిళ లే పిల్లలను అడ్డు పెట్టుకుని… మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణ తేలింది. ఇక పిల్లల కన్న వాళ్లను స్టేషన్ కు తీసుకురావడంతో మాకు తెలియదని ఆ కన్న వాళ్లే పోలీసుల ఎదుట చెప్పడం విశేషం. పక్కాగా “పోకిరి” సినిమాలో చూపించినట్లు గానే….గంజాయి ని..సిగరెట్ పీకల్లో పోసి…దాని ద్వారా పీల్చడం జరుగుతున్న ట్టు పోలీసులు గుర్తించారు.

ఇక విజయనగరం రైల్వే స్టేషన్ లో ఈ గంజాయి ని..అటు అడుక్కుంటున్న మహిళలకు…అక్కడ నుంచీ చదువు కుంటున్న పిల్లలకు ఎవరు సరఫరా చేస్తున్నారో పోలీసుల దర్యాప్తే చెప్పాలని అంటోంది..”సత్యం న్యూస్. నెట్”

Related posts

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

స్నిప‌ర్ టీమ్ తో అసాంఘీక కార్య‌క‌లాపాల‌‌పై నిఘా

Satyam NEWS

గడువు లోగా అనుమతులు ఇవ్వాలి

Bhavani

Leave a Comment