తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు అధ్యక్షతన ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు అధ్వర్యంలో ఉప్పల్ కాన్స్టెన్సీ డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జమ్మిగడ్డ లోనీ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు ,హరి, వాసు, తిరుపతిరావు, కాట్రాజ్ ,రాజు నాయక్, రవి నాయక్ ,సురేష్, పండితు రావు, భాస్కర్, రాంబాబు, తదితరులు ఖమ్మం బహిరంగ సభకు భారీ ఎత్తున బయలుదేరి వెళ్ళారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా