33.2 C
Hyderabad
May 4, 2024 00: 31 AM
Slider రంగారెడ్డి

ప్రజలు బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలి

#enugu

బీఆర్ఎస్,  కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని, వారి అసత్య ఎన్నికల హామీలు నమ్మొద్దని మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే వ్యక్తిని కాదని ఎల్లప్పుడూ మీ మధ్యలో  ఉండే మీ బిడ్డ నని  మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ పిలుపు నిచ్చారు. మేడ్చల్ పట్టణం, ఎల్లంపేట గ్రామంలో  బీజేపీ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి  ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని, దీంతో పేదలు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించాం కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రమే వెలుగులు నిండాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఓటేయ్యకుంటే ప్రభుత్వ పథకా లైన పింఛన్లు, డబుల్ బెడ్రూంలు ఇవ్వమని బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని, బిఆర్ఎస్,  కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని అభివృద్ధి కొరకు పాటుపడరని ఎన్నికల వరకే హామీలు, డబ్బు వాసన చూపించి ఓట్లు అడుగుతున్నారని అన్నారు.  తనపై ఏ ఒక్క తప్పుడు ఆరోపణ లేదని ప్రజలు బాగుపడాలంటే  బిజెపికి ఓటు వేసి మేడ్చల్ లో అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అధికార దూతగా వచ్చారా? అసమ్మతి నేతగా వచ్చారా?

Satyam NEWS

ఎటాకింగ్ పాలిటిక్స్ కాదు… ప్లానింగ్ పాలిటిక్స్ కావాలి

Satyam NEWS

విజయనగరం యూత్ సేవలను మెచ్చుకున్న డీజీపీ

Satyam NEWS

Leave a Comment