చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) ఓపెన్ మారథాన్ లో వరంగల్ కుర్రాడు సత్తా చాటాడు. నేపాల్ లో ని ఖాట్మాండులో జరిగిన ఈ ఓపెన్ మారథాన్ లో పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ స్థాయి 10 కిలోమీటర్ల పరుగుపందెంలో వరంగల్ జిల్లా పల్లారుగుడా గ్రామానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ బానోత్ ప్రవీణ్ నాయక్ కూడా పాల్గొన్నాడు.
ఈ COAS ఓపెన్ మారథాన్ & రన్ ఫర్ ఫన్ 2022 10 కి.మీ ల పరుగు పందెంలో రెండో స్ధానాన్ని దక్కించుకుని ప్రవీణ్ నాయక్ భారత పతాకాన్ని గురవేశాడు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పోలీసులు ఈ క్రీడల్లో పాల్గొంటారు. తెలంగాణ మారుమూల తండా నుంచి వెళ్లి అంతర్జాతీయ క్రీడారంగంలో తనదైన ప్రతిభ కనబరుస్తున్న ప్రవీణ్ బానోత్ ఉమ్లా నాయక్, మంగమ్మల కుమారుడు.