31.2 C
Hyderabad
May 3, 2024 02: 08 AM
Slider ప్రపంచం

26 ఏళ్ల వయసులో మరణించిన సత్యనాదెళ్ల కుమారుడు

#satyanadella

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల అతి పిన్న వయసులోనే మరణించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 26 సంవత్సరాల జైన్ నాదెళ్ల తుది శ్వాస తీసుకున్నాడు. జైన్ నాదెళ్ల మానసిక రుగ్మతలతో పుట్టాడు. అప్పటి నుంచి అతడిని సత్య నాదెళ్ల ఆయన భార్య అను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. సత్య నాదెళ్ల  2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మానసిక వికలాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అలాంటి వారి కి ఉపకరించే ఉత్పత్తులను తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ ను సిద్ధం చేశారు. జైన్‌ను పెంచడంలో తాను అనుభవించిన సంఘటనలను ఆధారం చేసుకుని వీటిని రూపొందించేవారు. “జైన్ నాదెళ్ల సంగీతంలో అభిరుచి కలిగి ఉండేవారని, ఎప్పుడూ చిరునవ్వు తోనే ఉండేవారని, అతను అందరికి గుర్తుండిపోతాడు” అని చిల్డ్రన్స్ హాస్పిటల్ CEO జెఫ్ స్పెరింగ్ ఒక సందేశం పంపారు.

Related posts

నరసరావుపేటలో కొడాలి నాని దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

అగ్నిపథ్ పథకంలో ఉన్న అసలు విషయం ఇది…

Satyam NEWS

Leave a Comment